
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఇండస్ట్రీ గత తొమిదేళ్లలోనే 20 రెట్లు వృద్ధి చెందిందని ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 2014 లో మొబైల్స్ డిమాండ్ చేరుకోవడానికి 78 శాతం దిగుమతి చేసుకునే వాళ్లమని, అదే 2023 లో అమ్ముడైన మొత్తం మొబైల్స్లో 99.2 శాతం ఇక్కడే తయారయ్యాయని చెప్పారు. మొబైల్ ఇండస్ట్రీపై రివ్యూ చేసిన ఆయన పై విధంగా ట్వీట్ చేశారు. 2014 – 15 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో మొబైల్ ఫోన్ల తయారీ రూ.18,900 కోట్లు మాత్రమేనని, 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ నెంబర్ రూ.3.5 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించారు.
మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు, లీడర్లతో అశ్విని వైష్ణవ్ చర్చలు జరిపారు. ఇండస్ట్రీ ప్రోగ్రెస్పైన, ఎదుర్కొంటున్న సమస్యలపై రివ్యూ చేశారు. మొబైల్ ఇండస్ట్రీ వృద్ధి చెందడడంతో దేశంలో మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వడంతో పాటు ఇంపోర్ట్లపై ఆధారపడడం భారీగా తగ్గింది. ఇండియాలో ఫోన్లను తయారు చేస్తామని తాజాగా గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే.